Thursday, March 28, 2024

ప‌లు జిల్లాల‌కు అద‌న‌పు క‌లెక్ట‌ర్స్ – ఉత్త‌ర్వులు జారీ

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల‌కు అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్స్ ని నియ‌మిస్తూ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది ప్ర‌భుత్వం. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. జగిత్యాల అదనపు కలెక్టర్ గా జీఎస్ లత, నారాయణ్ పేట్ అదనపు కలెక్టర్ గా జి. పద్మజారాణి, రాజన్న సిరిసిల్లా అదనపు కలెక్టర్ గా ఖీమా నాయక్ కు పోస్టింగులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అలాగే వరంగల్ అదనపు కలెక్టర్ గా కె. శ్రీవాస్తవ, ములుగు అదనపు కలెక్టర్ గా వై.వి. గణేష్, మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ గా ఎం. డేవిడ్ లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ గా ఉన్న పీ.శ్రీనివాస్ రెడ్డిని సిద్ధిపేటకు బదిలీ చేశారు. అంతేకాకుండా… బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పాలనాధికారి చంద్రమోహన్ ను కామారెడ్డి అదనపు కలెక్టర్ గా బదిలీ చేశారు. చంచల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయం పాలనాధికారిగా ఉన్న కె. అనిల్ కుమార్ తో పాటు హైదరాబాద్ జిల్లా భూ పరిరక్షణ ఎన్డీసీగా జీ. సంతోషినిలను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు పలువురు నాన్ కేడర్ అధికారులను కూడా బదిలీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement