Thursday, March 28, 2024

గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 8 మంది మృతి, 40 మందికి తీవ్ర గాయాలు

గాజాపై ఇవ్వాల (శుక్రవారం) ఇజ్రాయెల్​ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ అటాక్​లో ఒక సీనియర్ మిలిటెంట్‌తో సహా దాదాపు ఎనిమిది మంది దాకా చనిపోయినట్టు తెలుస్తోంది. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఒక సీనియర్ మిలిటెంట్‌ను అరెస్టు చేసిన దానికి ప్రతిస్పందనగా ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూపును లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

చనిపోయిన వారిలో 5 ఏళ్ల బాలిక కూడా ఉందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. మిగిలిన వారు మిలిటెంట్లా లేక పౌరులా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. చనిపోయిన వారిలో ఉత్తర గాజా కమాండర్ తైసీర్ అల్-జబారీ కూడా ఉన్నారని ఇస్లామిక్ జిహాద్ తెలిపింది. 2019లో వైమానిక దాడిలో హతమైన మరో ఉగ్రవాది ఇతనేనని తెలుస్తోంది. ఇక.. గాజా నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక ఎత్తైన భవనంలోని ఏడవ అంతస్థు నుండి పొగలు వెలువడడం కనిపించిందని, పెద్ద శబ్దం కూడా వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement