Friday, March 29, 2024

3rd ODI : మెరుపు ఇన్నింగ్స్ తో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ… భారీ స్కోర్ దిశగా భారత్

మూడో వన్డే మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ దంచికొట్టాడు. ఇన్నింగ్స్ లో ఎదుర్కొన్న మొదటి బంతి నుంచే బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో మెరుపు డబుల్ సెంచరీ 200 ( 126 బాల్స్ లో, 23 ఫోర్లు, 9 సిక్సర్లు ) చేశాడు. ధవన్ తర్వాత వచ్చిన కోహ్లీతో కలిసి రెండో వికెట్ పడకుండా కాపాడుతూనే, స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. బంగ్లాదేశ్ బౌలర్లు బాల్ వేయాలంటేనే భయపడేలా సిక్సర్లు, ఫోర్లతో వీరోచితమైన బ్యాటింగ్ ప్రదర్శించారు. బాల్ రాగానే బౌండరీ లైన్ దాటించడమే పనిగా పెట్టుకున్నాడు. అటు విరాట్ కోహ్లీ తనదైన శైలిలో బ్యాటింగ్ చేయడంతో భారత్ స్కోర్ పరుగులు పెడుతూ ముందుకు సాగింది. విరాట్ కోహ్లీ కూడా 76 బంతుల్లో 9 ఫోర్లతో 86 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement