Tuesday, April 16, 2024

బ్యాంకు లావాదేవీల్లో అక్రమాలు.. రోడ్డుపై కొట్టుకున్న కుప్పం బ్యాంకు ఉద్యోగులు

కుప్పం, (ప్రభ న్యూస్ ): చిత్తూరు జిల్లా కుప్పం టౌన్ బ్యాంకులో జరిగిన అవకతవకలకు సంబంధించి మాజీ ఉద్యోగికి.. ప్రస్తుత మేనజరుకు మధ్య పెరిగిన మాటల యుద్ధం కాస్త గొడవకు దారితీసింది. డబ్బుల గోల్మాల్ లో మాజీ ఉద్యోగి కిరణ్ ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. ఇతను బ్యాంకు లో రుణం తీసుకుని చెల్లించకపొగా వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. కిరణ్ శనివారం తన బకాయిలు చెల్లింపులు చేసినట్లు తెలిసింది.

ఈ విషయమై మేనజరు శివకు.. కిరణ్​కు మధ్య మాటమాట పెరిగి నడ్డి రోడ్డుపై కొట్టుకోవడం పట్టణంలో సంచలనంగా మారింది. కుప్పం టౌన్ బ్యాంకులో రోజుకొక్క విషయం బయటపడుతూ ఖాతాదారులల్లో భయందోళన కల్గిస్తున్నది. ఇప్పటికే మొండి బకాయిలు వసూలు అవుతున్న తరుణంలో ఈ ఘటన మరో మలుపు తీసుకోనున్నది. రోడ్డుపై ఇలా ప్రస్తుత ఉద్యోగి, సస్పెండ్ అయిన ఉద్యోగి కొట్టుకోవడం చూస్తుంటే కుప్పం టౌన్ బ్యాంకులో ఏం జరుగుతుంది అని పట్టణ ప్రజలు, ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement