Thursday, April 25, 2024

ఇక‌పై ఐపీఎల్ మ్యాచ్ కి – 50శాతం ప్రేక్ష‌కుల‌కి అనుమ‌తి

ఐపీఎల్ తాజా సీజ‌న్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 25శాతం ప్రేక్ష‌కుల‌తోనే మ్యాచ్ లు నిర్వ‌హించారు. మహారాష్ట్రలో కరోనా నిబంధనలు ఎత్తివేయడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఐపీఎల్ మ్యాచ్ లకు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాలు షురూ చేసినట్టు వెల్లడించింది. ఏదేమైనా ప్రేక్షకుల నడుమ సాగే క్రికెట్ మ్యాచ్ ల మజాయే వేరు. బీసీసీఐ తాజా నిర్ణయంతో స్టేడియంలు అభిమానులతో మళ్లీ కళకళలాడునున్నాయి. కాగా, బోర్డు తాజా నిర్ణయం ఏప్రిల్ 6 నుంచి వర్తిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement