Friday, April 19, 2024

ఈటల భూకబ్జాలపై విచారణ.. మంత్రి స్వగ్రామంలో టెన్షన్

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ అక్రమాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మంత్రి భూకబ్జాల ఆరోపణలపై సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇవాళ విచారణ ప్రారంభమైంది. అచ్చంపేట ప్రభుత్వ స్కూల్ కి ఎమ్మార్వో, విజిలెన్స్ అధికారులు వెళ్లారు. సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన రైతుల నుండి సమాచారం సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, సీఎం కేసీఆర్ నివేదిక సమర్పించనున్నారు. ఈటల ఆయన అనుచరులు తమ భూములను కబ్జా చేయడంతో పాటు బెదిరింపులకు కూడా పాల్పడ్డారని కొందరు రైతులు, గ్రామస్థులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో కేసీఆర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు నిజానిజాలను నిగ్గుతేల్చాలన్నారు.

మరోవైపు మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో అచ్చంపేటకు ఈటల రాజేందర్ అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. మంత్రి ఈటల రాజేందర్‌ స్వగ్రామం కమలాపూర్‌లో అడుగడుగునా భారీగా పోలీసులు మోహరించారు. కాగా ఈటలపై వేటువేసే ఉద్దేశ్యంతోనే పోలీసులు మోహరించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈటల రాజేందర్ అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఈటలకు అన్యాయం జరిగితే చూస్తూ సహించేది లేదని అభిమానులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement