Thursday, April 25, 2024

Breaking | లిక్క‌ర్ స్కామ్‌లో విచార‌ణ‌.. సాక్షిగా ఎమ్మెల్సీ కవిత నుంచి వివరణ తీసుకున్న సీబీఐ

ఢిల్లీ లీక్క‌ర్ స్కాముకు సంబంధించిన విచార‌ణ ఇంకా కొన‌సాగుతోంది. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత నుంచి సీబీఐ అధికారులు ఇవ్వాల (ఆదివారం) వివరణ తీసుకున్నారు. సీఆర్పీసీ 160 సెక్షన్‌ కింద నోటిసు ఇచ్చిన అధికారులు ఆదివారం ఉదయం 10.50 గంటల ప్రాంతంలో హైద‌రాబాద్‌లోని క‌విత నివాసానికి చేరుకున్నారు. ఆరుగురు సీబీఐ అధికారులతో కూడిన బృందానికి రాఘవేంద్ర వస్త నాయకత్వం వహించారు.

ఇక‌.. సాయంత్రం 6 గంటల వరకు ఎమ్మెల్సీ క‌విత నుంచి ప‌లు అంశాల‌మీద ప్ర‌శ్న‌లు వేసి వివరణ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విచార‌ణ సందర్భంలో మహిళా సీబీఐ అధికారి కూడా తమ వెంట ఉన్నారు. సీబీఐ అధికారుల విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా బీఆర్‌ఎస్‌ శ్రేణులు పూర్తిగా సహకరించాయి. ఎక్కడా ఇబ్బంది లేకుండా పార్టీ శ్రేణులు ఎవరూ ఇంటికి రావొద్దని ముందే కవిత సూచించడంతో ఆమె ఇంటి పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. మీడియా ప్రతినిధులు మినహా మరెవరూ ఆ ప్రాంతంలో కనిపించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement