Thursday, April 25, 2024

నా హృద‌యంలో స‌గ‌భాగం భార‌తీయుల‌కే..వైరల్ గా ఐక్య‌రాజ్య‌స‌మితి మాజీ సెక్ర‌ట‌రీ వ్యాఖ్య‌లు..

త‌న హృద‌యంలో స‌గ‌భాగం భార‌తీయుల‌కే చెందుతుంద‌ని తెలిపారు ఐక్య‌రాజ్య‌స‌మితి మాజీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ బాన్ కీ మూన్… రిసాల్వ్ డ్..: యునైటింగ్ నేషన్స్ ఇన్ ఏ డివైడెడ్ వరల్డ్ పేరిట తన ఆత్మకథను రాశారు.బాన్ కీ మూన్ ఆత్మకథను హార్పర్ కొలిన్స్ ఇండియా ముద్రణా సంస్థ ప్రచురించింది. దక్షిణ కొరియా జాతీయుడైన బాన్ కీ మూన్ తన ఆత్మకథలో భారతదేశం గురించి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. దౌత్యాధికారిగా తన తొలి ఉద్యోగం భారత్ లోనే నిర్వర్తించానన్నారు. తన భార్య‌ సూన్ టేక్ 1972లో ఢిల్లీ వచ్చామని, అక్కడే తాను మూడేళ్ల పాటు పనిచేశానని వివరించారు.

తొలుత కొరియన్ కాన్సులేట్ జనరల్ లో వైస్ కాన్సుల్ గా పనిచేశానని వెల్ల‌డించారు. 1973లో భారత్-కొరియా మధ్య పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయని, ఆ సమయంలో కొరియా రాయబార కార్యాలయంలో సెకండ్ సెక్రటరీగా పనిచేశాను.. భారత్ లో నా ఆస్తి, అప్పులు పట్టిక సమగ్రంగా ఉందని తాను భారతీయులతో చమత్కరిస్తుంటానని, అందుకు కారణం ఉందన్నారు. తన కుమారుడు భారత్ లోనే జన్మించాడని, తన చిన్న కుమార్తె హ్యూన్ హీ ఓ భారతీయుడినే వివాహం చేసుకుందన్నారు. భారత్ లో తన ప్రస్థానానికి 50 ఏళ్లు గడిచాయని వివ‌రించారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement