Wednesday, April 24, 2024

బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్2 అంత్య‌క్రియ‌ల‌కి హాజ‌రుకానున్న – భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌తి ముర్ము

లండ‌న్ వెస్ట్ మినిస్ట‌ర్ అబ్బేలో బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్ -2 అంత్య‌క్రియ‌లు ఈ నెల ఈ నెల 19న జరగనున్నాయి. కాగా క్వీన్ అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు ఆమె లండన్ లో ఉంటారు. భారతదేశం తరపున ఎలిజబెత్ రాణికి ఆమె నివాళి అర్పిస్తారు. ఈ నెల 8న క్వీన్ ఎలిజబెత్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రాణి మృతి పట్ల భారత రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, ప్రధాని మోడీలు సంతాపాన్ని ప్రకటించారు. రాణి మరణం నేపథ్యంలో ఈ నెల 11న భారత్ లో సంతాప దినాన్ని పాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement