Thursday, March 28, 2024

టీమిండియా క్రికెటర్ కి క‌రోనా

భార‌త క్రికెట్ జ‌ట్టులో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్ల‌లో ఒక‌రికి కరోనా సోకింది. గొంతునొప్పి బాధ‌ప‌డుతున్న ఆ ఆట‌గానికి క‌రోనా టెస్ట్ నిర్వ‌హించ‌గా.. పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన‌ట్టుగా స‌మాచారం. దీంతో ఆ ఆట‌గానితో స‌న్నిహితంగా మెలిగిన‌వారిని ఇప్ప‌టికే మూడు రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉంచిన‌ట్టుగా తెలుస్తోంది. గురువారం ఆ ఆటగాడు మినహా..  మిగతా వాళ్లంతా డర్హమ్‌కు బయలుదేరనున్నారు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌లో డెల్టా వేరియెంట్ డేంజ‌ర‌స్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే ముందు జాగ్ర‌త్త‌గా ఆట‌గాళ్ల‌కు క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌గా బ‌య‌ట‌ప‌డింది. ఆగష్టు 5వ తేదీ నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడాల్సి ఉంది. 

ఇది కూడా చదవండి: తెలుగు అకాడమీ టీడీపీ అకాడమీ కాదు

Advertisement

తాజా వార్తలు

Advertisement