Friday, March 29, 2024

భారత మత్య్సకారులపై.. శ్రీలంక నేవీ అధికారుల దాడి.. 14మంది అరెస్ట్

శ్రీలంక నేవీ అధికారులు భారతదేశానికి చెందిన మత్స్యకారులపై దాడి చేయగా.. మత్స్యకారుల్లో ఒకరి కంటికి తీవ్రగాయం అయింది. సముద్ర సరిహద్దులను ఉల్లంఘించినందుకు ఆ దేశ నేవీ ఈ చర్యకు ఉపక్రమించింది. దాడి చేసిన అనంతరం తమిళనాడుకు చెందిన 14 మంది మత్స్యకారులను అరెస్టు చేసింది. గాయపడిన మత్స్యకారుడిని రామేశ్వరానికి చెందిన జాన్సన్‌గా గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ మత్స్యకారులంతా నాగపట్నం జిల్లాకు చెందిన వారని తెలిపారు. వీరు చేపల వేటకు వెళ్లిన పడవను కూడా శ్రీలంక నేవీ సీజ్ చేసింది.ఈ ఘటనకు సంబంధించి భారత్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా ఇంకా తెరపైకి రాలేదు. అయితే గతంలో కూడా సరిహద్దు ఉల్లంఘన విషయంలో శ్రీలంక నేవీ ఇలాంటి చర్యలే తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement