Wednesday, April 24, 2024

భారత సైన్యం పవర్ ఫుల్ … కానీ ప్రభుత్వమే బలహీనం … అసదుద్దీన్ ఓవైసీ

సరిహద్దుల్లో భారత సైన్యం పవర్ ఫుల్ గా ఉందని.. కానీ వారికి మద్దతుగా నిలవడంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం బలహీనంగా ఉందని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ… ఈనెల 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత్ – చైనా మధ్య ఘర్షణపై పార్లమెంట్ వేదికగా తీవ్ర రాజకీయ దుమారం చెల్లరేగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అసదుద్దీన్ ఓవైసీ కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. చైనా సైన్యం భారత భూభాగంలోకి వచ్చినా.. ఎవరూ రాలేదంటూ దేశ ప్రజలను ప్రధాని మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. చైనా సైనికులు దేప్సాంగ్, డెంచోకులను ఆక్రమించినట్లుగా శాటిలైట్ చిత్రాలు రుజువు చేస్తున్నాయని ఓవైసీ ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ పై పార్లమెంటులో చర్చకు కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోందని అసదుద్దీన్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement