Friday, March 29, 2024

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్..

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ను భారత్ జట్టు కైవసం చేసుకుంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది. మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. రెండో టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు గెలుపొంది. అయితే ఈరోజు జరిగిన న్యూజిలాండ్‌ vs ఇండియా మ‌ధ్య జరిగిన మూడ‌వ టీ20 మ్యాచ్ వర్షం కారణంగా టై అయ్యింది. దీంతో భారత్ జట్టు టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టి న్యూజిలాండ్ జట్టు 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ కాగా.. 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 9ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. వర్షం రావడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో టీ20 సిరీస్ ఇండియా చేజిక్కించుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement