Saturday, April 20, 2024

దేశంలో కరోనా కలవరం.. 45 వేలు దాటిన కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,352 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,29,03,289కి చేరింది. అలాగే, నిన్న 34,791 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 366 మంది మృతి చెందారు.

నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 32,097 కేసులు న‌మోదు కాగా… 188 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,39,895కి పెరిగింది.

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,20,63,616 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,99,778 యాక్టర్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 67,09,59,968 కోట్ల‌ డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. రిక‌వ‌రీ రేటు 97.45 శాతంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement