Wednesday, April 17, 2024

Inida Corona: మళ్లీ పెరిగిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,987 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్​ తో మరో 246 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 19,808 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,40,20,730కు చేరింది. ఇందులో 3,33,62,709 మంది బాధితులు కోలుకోగా.. 2,06,586 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 4,51,435 మంది కరోనాకు బలైయ్యారు. ఇప్పటివరకు మొత్తం 96,82,20,997 డోసుల టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. బుధవారం ఒక్కరోజే 35,66,347 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: ఈ నెల 25న టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక

Advertisement

తాజా వార్తలు

Advertisement