Friday, April 19, 2024

Corona Update: దేశంలో కొత్తగా 9,419 కేసులు.. 159 మరణాలు

భారత్​లో కరోనా రోజువారీ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.… గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 9,419 క‌రోనా కేసులు నమోదైయ్యాయి. వైరస్ తో మరో 159 ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 8,251 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో 94,742 కేసులు యాక్టీవ్‌ గా ఉన్నాయి.

భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,74,111 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 3,46,66,241కి చేరింది. ఇందులో మొత్తం 3,40,97,388 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక, నిన్న ఒక్కరోజే 80,86,910 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేశారు.  దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 1,30,39,32,286 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement