Friday, March 29, 2024

Covid Flash: దేశంలో మరింత తగ్గిన కరోనా.. 535 రోజుల తర్వాత ఇదే తొలిసారి!

దేశంలో కరోనా రోజువారి కేసులు తగ్గాయి. అయితే, నిన్నటితో పొల్చితే స్వల్పంగా కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 9,283 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 10,949 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,39,57,698 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,11,481 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  ఇంత తక్కువ యాక్టివ్ కేసులు నమోదు కావడం 537 రోజుల తర్వాత ఇదే మొదటి సారి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 118 కోట్ల మందికి పైగా కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement