Thursday, April 18, 2024

India Corona: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,119 మందికి కరోనా సోకింది. కోవిడ్ తో మరో 396 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,264 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 3,45,44,882కి చేరింది. ఇందులో 3,39,67,962 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.


దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,09,940 కు చేరింది. 539 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు పడిపోయాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 4,66,980 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,19,38,44,741 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement