Thursday, April 18, 2024

India Corona: దేశంలో కొత్తగా 8,954 మందికి కరోనా

ప్రపంచంపై కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విరుచుకుపడుతున్న వేళ.. దేశంలో మహమ్మారి కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,954 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10,207 మంది కరోనా నుంచి కోలుకోగా.. మరో 267 మంది మరణించారు. దేశంలో 99,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,45,96,776కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 4,69,247 మంది వైరస్ కు బలైయ్యారు. మరోవైపు వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు 124,10,86,850 మందికి కరోనా టీకా వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement