Thursday, April 25, 2024

India Corona: దేశంలో భారీగా తగ్గిన కరోనా.. 538 రోజుల తర్వాత తొలిసారి..

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 8,488 కరోనా కేసులు కొత్తగా నమోదైయ్యాయి. ఇంత తక్కువ కరోనా మహమ్మారి కేసులు నమోదు కావడం 538 రోజుల తర్వాత ఇదే మొదటిసారి.

గడచిన 24 గంటల్లో 12,510 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా మహమ్మారి నుంచి కోల్పోయిన వారి సంఖ్య 33,93,4,547 కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,18, 443 యక్టివ్ కేసులు ఉన్నాయి. ఇంత తక్కువ యాక్టివ్ కేసులు నమోదు కావడం 534 రోజుల తర్వాత ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 116 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement