Wednesday, April 24, 2024

Corona Update: దేశంలో పెరిగిన కరోనా మరణాలు.. కొత్త కేసులు ఎన్నంటే..

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజుల నుంచి 10 వేల కన్నా తక్కువగానే రోజూ వారి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 8,318 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. కరోనాతో 465 మంది మరణించారు. అదే సమయంలో 10,967 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకుని ఆరోగ్యవంతులైయ్యారు.

ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,44,56,730కి చేరాయి. ఇందులో 3,39,88,797 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,07,019 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 4,67,933 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 120 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement