Thursday, April 25, 2024

Covid-19: భారత్ లో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే..

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజువారి కేసుల సంఖ్య మూడు వేలకుపైగానే నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,377 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,72,176కు చేరాయి. ఇందులో 4,25,30,622 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. గత 24 గంటల్లో 2496 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

కరోనాతో మరో 60 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 5,23,753కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 17,801 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతానికి చేరింది. ఇప్పటివరకు 1,88,65,46,894 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొన్నది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement