Friday, April 19, 2024

India Corona: దేశంలో భారీగా పెరిగిన కరోనా.. 24 గంటల్లో 33,750 కేసులు

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగుతున్నాయి. నిన్నటితో పొల్చితే నేటి కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 33,750 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అదే సమయంలో 10,846 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మరో 123 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో ప్ర‌స్తుతం 1,45,582 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 3,42,95,407 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 4,81,893 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,45,68,89,306 క‌రోనా వ్యాక్సిన్ల డోసులు అందిచినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement