Friday, March 29, 2024

India Corona: దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా ఎన్ని కేసులంటే..

దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3324 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,79,188కి చేరాయి. ఇందులో 4,25,36,253 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో దేశంలో 40 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,23,843కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 19,092 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అదే సమయంలో 2876 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement