Friday, April 26, 2024

Corona update: దేశంలో స్పల్పంగా తగ్గిన కరోనా.. కొత్తగా 3157 కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత రోజులతో పోలిస్తే తాజాగా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంట్లలో దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,82,345కు చేరాయి. ఇందులో 4,25,38,976 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు.

గత 24 గంటల్లో 26 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 5,23,869కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 2723 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,500 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.74 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నది. ఇక ఇప్పటివరకు 1,89,23,98,347 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement