Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 27,254 మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 27,254 మందికి వైరస్​ సోకింది. కోవిడ్ తో 219 మంది మృతి చెందారు. ఒక్కరోజే 37,687 మంది కరోనా​ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,32,64,175కి చేరింది. ఇందులో 3,24,47,032 మంది కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 4,42,874కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,74,269 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

దేశంలో మొత్తం 74,38,37,643 మందికి వ్యాక్సిన్లు వేశారు. నిన్న ఒక్కరోజే 53,38,945 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా ఆదివారం 12,08,247 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

ఇది కూడా చదవండి: Drug Case: ఈడీ ముందుకు నవదిప్…

Advertisement

తాజా వార్తలు

Advertisement