Wednesday, April 24, 2024

India Corona: దేశంలో కరోనా తగ్గేదే లే.. కొత్తగా 2593 కేసులు

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,57,545కు చేరాయి. ఇందులో 4,25,19,479 మంది కోలుకున్నారు. గడిచిన గత 24 గంటల్లో 44 మంది కరోనా ప్రాణాలో కోల్పోయారు. అదే సమయంలో 1755 మంది కోలుకున్నారు.

దేశంలో ఇప్పటివరకు మొత్తం 5,22,193 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 15,873 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక మొత్తం కేసులల్లో యాక్టివ్‌ కేసులు 0.04 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.75 శాతం ఉండగా.. రోజువారీ పాటివిటీ రేటు 0.546 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు 1,87,67,20,318 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement