Wednesday, April 24, 2024

దేశంలో 90 కోట్లకు చేరువైన వ్యాక్సినేషన్

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశంలో కొత్తగా 24,354 మంది​కి కరోనా నిర్ధారణ అయింది. వైరస్ తో 234 మంది ప్రాణాలు చనిపోగా.. 25,455 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,37,91,061 మంది కరోనా బారిన పడగా.. ఇందులో 3,30,68,599 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం దేశంలో 2,73,889 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 4,48,573 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకు 89,02,08,007 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. శుక్రవారం 69,33,838 వ్యాక్సిన్​ డోసులను లబ్దిదారులకు అందించినట్లు తెలిపింది.

ఇది కూడా చదవండిః పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇలా..

Advertisement

తాజా వార్తలు

Advertisement