Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 21,257 మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 21,257 మంది​కి కొవిడ్ ​​​సోకింది. అదే సమయంలో ఒక్కరోజే 24,963 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. మరో 271 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,39,15,569కి చేరింది. ఇందులో  3,32,25,221 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 2,40,221 కేసులు యాక్టివ్‌గా ఉండగా..  4,50,127 మంది వైరస్‌ వల్ల మరణించారు. ఇప్పటివరకు మొత్తం 93,17,17,191 మందికి టీకాలు పంపిణీ చేసిటన్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement