Friday, April 19, 2024

Corona: దేశంలో కొత్తగా 2.68 లక్షల కరోనా కేసులు.. 402 మరణాలు

భారత్ లో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది. రోజు వారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,68,833 కేసులు న‌మోదు అయ్యాయి. వైరస్​తో మరో 402 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 4,85,752కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 1,22,684 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,49,47,390కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 14,17,820 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు దేశ వ్యాప్తంగా 156.02 వ్యాక్సిన్ డోసులు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement