Monday, April 15, 2024

India Corona: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా.. కొత్తగా 2.51 లక్షల కేసులు

దేశంలో క‌రోనా విజృంభిస్తోంది. అయితే, నిన్నటితో పొల్చితే నేటి కేసులు స్వల్పంగా తగ్గాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ ప్ర‌కారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,51,209 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా 627 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్ర‌స్తుతం దేశంలో 21,05,611 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో 3,47,443 మంది కోవిడ్ ను జ‌యించారు. రోజువారీ పాజివిటి రేటు 15.88 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,64,44,73,216 క‌రోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసిన‌ట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement