Friday, April 19, 2024

Inida Corona: 206 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. మరోసారి 20 వేల దిగి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,740 మంది​ వైరస్​ బారిన పడ్డారు. మరో 248 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 23,070 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తతుం  2,36,643 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 206 రోజుల కనిష్ఠానికి చేరింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,39,35,309కి చేరింది. ఇందులో 3,32,4,291 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో  4,50,375 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 93,99,15,323కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

Advertisement

తాజా వార్తలు

Advertisement