Friday, March 29, 2024

దేశంలో భారీగా తగ్గిన కరోనా.. కొత్తగా 16 వేల కేసులు

దేశంలో కరోనా కేసులు విపరీతంగా తగ్గిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,051 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,38,524 కు చేరింది. 206 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 5,12,109కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 37,901 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 4,21,24,284కు చేరింది. దేశంలో ప్రస్తుతం 2,02,131 యాక్టివ్ కరోనా కేసుల ఉన్నాయి.  ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,75,46,25,710 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement