Thursday, March 28, 2024

Inida Corona Cases: దేశంలో కరోనాకు 164 మంది బలి

దేశంలో రోజువారి కరోనా కేసులు తగ్గుతున్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 13,058 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అదే సమయంలో 19,470 మంది క‌రోనా నుంచి కోలుకోగా..మరో 164 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. కేరళలో కొత్త‌గా 6,676 కేసులు వెల్లడి కాగా.. 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 1,83,118 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనాతో మొత్తం 4,52,454 మంది ప్రాణాలో కోల్పోయారు. మరోవైపు దేశవ్యాప్తంగా క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 98.67 కోట్ల కోవిడ్ టీకా డోసుల‌ను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ సర్కార్ కు షాక్.. హుజురాబాద్ లో దళిత బంధుకు బ్రేక్

Advertisement

తాజా వార్తలు

Advertisement