దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,466 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 460 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి నిన్న 11,961 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం 3,37,87,047 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,39,683 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 4,61,849 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు టీకాల పంపిణీ కూడా వేగంగా సాగుతోంది. నిన్న 52,69,137 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం 109,63,59,208 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.