Thursday, April 25, 2024

India Corona: దేశంలో కొత్తగా 15,823 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,823 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో మరో 226 మంది మరణించగా.. 22,844 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. ఇందులో 3,33,42,901 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,51,189 మంది బాధితులు మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,07,653 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతున్నది. ఇప్పటివరకు 96,43,79,212 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. 

ఇది కూడా చదవండి: పిల్లలకు కొవాగ్జిన్ టీకా.. అత్యవసర వినియోగానికి అనుమతి?

Advertisement

తాజా వార్తలు

Advertisement