Saturday, April 20, 2024

దేశంలో మళ్లీ పడగ విప్పుతున్న కరోనా

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారంతో పోలిస్తే ఈ రోజులు కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 42,982 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 533 మంది మరణించారు. అదే సమయంలో 41,726 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసులు సంఖ్య 3,18,12,114 ఉండగా.. 4,26,290 మంది మరణించారు. ఇక కోవిడ్ నుంచి 3,09,74,748 మంది పూర్తిగా కోలుకున్నారు.  ప్రస్తుతం దేశంలో 4,11,076 యాక్టివ్​ కేసులున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 48,93,42,295 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బుధవారం కొత్తగా 37,55,115 డోసులు అందించినట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement