Saturday, April 20, 2024

దేశంలో మళ్లీ 43 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 43 వేల పైచిలుకు కేసులు నమోదైయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 43,263 కరోనా కేసులు నమోదు కాగా.. 338 మంది మృతి చెందారు. కొత్త కేసుల్లో అత్యధికంగా కేరళలో నమోదైనవే ఉన్నాయి. కేరళలో మొత్తం 30,196 కేసులు నమోదవగా, 181 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,31,39,981కు చేరింది. ఇందులో 3,23,04,618 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 40,567 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం దేశంలో 3,93,614 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 4,41,749 మంది బాధితులు మృతిచెందారు. కాగా, ఇప్పటి వరకు దేశంలో 71,65,97,428 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిపై గవర్నర్ అసంతృప్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement