Saturday, April 20, 2024

India Corona: దేశంలో కొత్తగా 3451 కరోనా కేసులు.. 40 మరణాలు

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజువారి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,451 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,00,643 కు చేరింది. ఇందులో మొత్తం 4,25,57495 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3079 మంది కరోనా నుంచి కోలుకోగా.. 40 మంది కరోనా తో మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,24,064 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 20,635 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.04 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,90,20,07,487 మందికి కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement