Tuesday, April 16, 2024

Covid-19: దేశంలో 24 గంటల్లో 2,841 కేసులు నమోదు

భార‌త్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొన‌సాగుతోంది. రోజు వారి కేసుల సంఖ్య మ‌రోసారి మూడు వేల‌కు చేరువ అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2841 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,16,254 కు చేరింది. ఇందులో 4,25,73,460 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొరోనాతో నిన్న‌ 9 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,24,190కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3295 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.78 శాతంగా ఉంది. ఇక దేశంలో 18,604 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,90,99,44,803 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement