Tuesday, April 23, 2024

దేశంలో 26 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంట‌ల్లో కొత్తగా 26,727 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మరో 277 మంది వైర‌స్ బారినప‌డి మృతి చెందారు. అదే సమయంలో 28,246 మంది బాధితులు వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో.. ఒక్క కేరళలోనే 15,914 కేసులువెలుగు చూశాయి. మరో 122 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33,766,707కి చేరగా.. ఇందులో 3,30,43,144 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం 4,48,339 మంది వైరస్ కి బలైయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,75,224 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్రక్రియ కూడా వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 89,02,08,007 మందికి క‌రోనా టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి రేట్లు ఇలా..

Advertisement

తాజా వార్తలు

Advertisement