Friday, March 29, 2024

దేశంలో కొత్తగా 34,973 క‌రోనా కేసులు

దేశంలో వినాయక చవితి వేడులకు జరుగుతుంటే.. మరోవైపు కరోనా కేసులు భయపెడుతున్నాయి. దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,31,74,954కు చేరింది. ఇందులో 3,23,42,299 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 37,681 మంది కోలుకోగా.. క‌రోనాతో మ‌రో 260 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,42,009కి చేరింది.  ప్రస్తుతం 3,90,646 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 26,200 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 114 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 72,37,84,586 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

ఇది కూడా చదవండిః జై జై గణేశా.. వినాయక చవితి విశిష్టత ఇది!

Advertisement

తాజా వార్తలు

Advertisement