Friday, April 19, 2024

Covid-19: దేశంలో కొత్తగా 3,205 కేసులు.. 31 మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 31 మంది కరోనా బారిన పడి మరణించారు. అదే సమయంలో మొత్తం 2802 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 5,23,920 మంది మహమ్మారి బారిన పడి మరణించారు. కాగా, ఇప్పటివరకు మొత్తం 4,25,44,689 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, దేశంలో ఇప్పటివరకు మొత్తం 189,48,01,203 డోసుల వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement