Wednesday, April 24, 2024

Covid-19: దేశంలో కొత్తగా 2,897 మందికి కరోనా

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య ఓ రోజు తగ్గుతూ..మరోరోజు పెరుగుతున్నాయి. నిన్న కేసులు తగ్గగా.. తాజాగా పెరిగాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో 2,897 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,986 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. 

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,10,586కి చేరుకుంది. ఇందులో ఇప్పటి వరకు 4,25,66,935 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,157 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 19,494 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 190 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement