Friday, April 26, 2024

భార‌త‌దేశం నా శ‌రీరంలో అంత‌ర్భాగం.. సుంద‌ర్ పిచాయ్

ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా త‌న వెంట భార‌త‌దేశాన్ఇన తీసుకెళ‌తాన‌ని చెప్పారు గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్. భారతదేశం తన శరీరంలో అంతర్భాగమని అన్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకుంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2022 ఏడాదికిగానూ సుందర్ పిచాయ్ కి పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించగా.. అమెరికాలోని భారత రాయబారి నుంచి సుందర్ పిచాయ్ ఈ పురస్కారం అందుకున్నారు.

శాన్ ఫ్రాన్సిస్కో లో నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు ఈ అవార్డును సుందర్ పిచాయ్ కి అందజేశారు. భారత దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ ను తనకు అందించడంపై సుందర్ పిచాయ్ భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులను, తన ఎదుగుదలకు సహాయపడిన వారిని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement