Saturday, April 20, 2024

మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత

టీమిండియాకు స్లో ఓవర్ రేట్ కారణంగా భారీగా జరిమానా పడింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ రెఫరీ ఫైన్ వేశాడు. నిర్ణయాత్మక మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో జరిమానా విధించినట్లు తెలిపారు మ్యాచ్‌ రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌. టీమిండియా మ్యాచ్‌ ఫీజులో 40 శాతం ఫైన్‌ విధించాడు జవగళ్ శ్రీనాథ్. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తమ తప్పిదాన్ని ఒప్పుకోవడంతో పాటు జరిమానాకు కూడా అంగీకారం తెలిపాడు. అటు అంతకముందు మ్యాచ్ లో ఇంగ్లండ్ కూడా నిర్ణీత సమాయానికంటే ముందు ఒక ఓవర్ తక్కువగా వేయండంతో మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement