Thursday, April 25, 2024

బీ అలర్ట్.. ఒక్కరోజే లక్షకు చేరువలో కరోనా కేసులు

దేశంలో సెకండ్ వేవ్‌లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య మళ్లీ గరిష్ఠ స్థాయికి చేరుతోంది. దేశ వ్యాప్తంగా కొత్తగా దాదాపు లక్ష మంది కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో 11,66,716 మందికి కరోనా టెస్టులు చేయగా 93,249 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,85,509కి చేరింది. శనివారం కరోనాతో 513 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,64,623కు పెరిగింది. ఇప్పటివరకు 1,16,29,289 మంది కరోనాను జయించారు. 6,91,597 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 7,59,79,651 డోసుల టీకాలు పంపిణీ చేసినట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement