Wednesday, April 24, 2024

దేశంలో కొత్తగా 43,733 కరోనా కేసులు.. 930 కరోనా మరణాలు

దేశంలో గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 43,733 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 47,240 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ ప్రభావంతో మరో 930 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,06,63,665కు పెరిగింది. మొత్తం 2,97,99,534 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి ప్రభావంతో 4,04,211 మంది మృతి చెందారు. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 36,13,23,548 వ్యాక్సిన్ డోసులు వేశారు. క‌రోనా కేసుల రిక‌వ‌రీ రేటు 97.18 శాతంగా ఉంది.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా 3,042 కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement