Friday, April 19, 2024

India Corona: దేశంలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీ రేటు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్​ తో 166 మంది మృతిచెందగా.. 19,582 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రోజువారీ కరోనా కేసులు 230 రోజుల కనిష్ఠానికి చేరడం గమనార్హం. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,40,81,315కు చేరింది. 3,34,39,331 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,89,694 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 4,52,290 మంది కరోనా వల్ల మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.12 శాతం, మరణాల రేటు 1.33 శాతం అని వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 97.79 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: విప్లవ పయనమెటు? తగ్గిపోతున్న మావోయిస్టు కేడర్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement