Tuesday, April 23, 2024

నిలకడగా కరోనా కేసులు: దేశంలో కొత్తగా 48 వేల మందికి కోవిడ్

దేశంలో రోజువారి కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టినప్పటికి గత వారం రోజులుగా నిలకడగా నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 48,786 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం.. 24 గంట‌ల్లో  61,588 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  3,04,11,634కు చేరింది. ఇక మరణాల విషయానికొస్తే, నిన్న 1,005 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,99,459  కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,94,88,918 మంది కోలుకున్నారు. 5,23,257 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 33,57,16,019 డోసుల వ్యాక్సిన్లు వేశారు.

ఇది కూడా చదవండి: కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ ఫెయిల్: సర్వే

Advertisement

తాజా వార్తలు

Advertisement